Telugu Updates

Sunday 3 February 2013

జిన్నారంలో కేంద్రవూపభుత్వం, మంత్రులు చిదంబరం, షిండేలపై కేసు

జిన్నారంలో కేంద్రవూపభుత్వం, మంత్రులు చిదంబరం, షిండేలపై కేసు: బలిదానాలకు కేంద్ర సర్కారుదే బాధ్యత
 
-జిన్నారంలో కేంద్రవూపభుత్వం, మంత్రులు చిదంబరం, షిండేలపై కేసు
జిన్నారం (మెదక్): తెలంగాణను తేల్చకపోవడంవల్లే వెయ్యిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంవూదవూపభుత్వంపై కేసు నమోదు చేయాలంటూ జిన్నారం మండల టీఆర్‌ఎస్ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర యువత కార్యదర్శి గౌరిశంకర్ ఆధ్వర్యంలో నాయకులు శంకర్, చిట్కుల వెంక ఇతర నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సై బాల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఆత్మబలిదానాలకు సంబంధించిన వివిధ పత్రికల కథనాలను ఫిర్యాదుకు జత చేశారు. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైన కేంద్రవూపభుత్వంతోపాటు అప్పటి, ప్రస్తుత కేంద్ర హోంమంవూతులు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసీఆర్, కోదండరాంలను అరెస్టు చేస్తే ఊరుకోం: టీజీవీపీ
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ఉద్యమ సారధులు కేసీఆర్, కోదండరాంలను అరెస్టు చేస్తే ఊరుకోబోమని టీజీవీపీ హెచ్చరించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంవూదరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి సీమాంధ్ర నేతలు తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడింది. ఈ మేరకు టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యమాన్ని చీల్చాలనుకున్నా, ఉద్యమకారులను అరెస్టు చేసినా సీమాంధ్ర నాయకులపై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించారు. సీఎంకు చెంచాలుగా వ్యవహరిస్తున్న జగ్గాడ్డి, కే లకా్ష్మడ్డిలకు త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు.

No comments:

Post a Comment

Chitika Ads