Telugu Updates

Sunday 3 February 2013

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహ గర్జన : ఓయూ జేఏసీ

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహ గర్జన : ఓయూ జేఏసీ:


తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చి రెండో తేదీన హైదరాబాద్ నింజా కాళాశాల మైదానంలో తెలంగాణ విద్యార్థి సింహ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఓయూ జేఏసీ శనివారం ప్రకటించింది. అలాగే, మార్చి 20వ తేదీన ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపింది.

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 20 తేదీన చలో హైదరాబాద్ నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

అలాగే, ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు, మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన, మార్చి 20న ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని జేఏసీ నేతలు తెలిపారు.

No comments:

Post a Comment

Chitika Ads